బీహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఇవాళ అరో పర్యాయం అదే బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ సొంత పార్టీలో ట్విస్ట్ బయటకొచ్చింది. నితీశ్ విశ్వాస పరీక్షకు ముందు జేడీయు పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. బీజేపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్లు సమాచారం. అయితే ఈ లుకలుకలను బయటకు పొక్కనీయకుండా పార్టీకి చెందిన మరికొందరు నేతలు వారిని పలు విధాల ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుస్తుంది.
ఆర్జేడీ.. కాంగ్రెస్ స్నేహ హస్తాలను వదులుకొని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్ కుమార్ పై పార్టీ అగ్రనేత శరద్ యాదవ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన ఇవాళ ఓ వైపు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఆయన మాత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో జవహార్ భవన్ లో భేటీ అయ్యారు. బీజేపితో మైత్రిని కొందరు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన రాహుల్ కు వివరించినట్లు సమాచారం. ఇక పార్టీ ఎంపీలతో ఆయన ఇవాళ భేటీ అయిన తరువాత కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.
అయితే తమ పార్టీ సమైక్యంగా ఉందని.. లుకలుకలు వున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ కల్పితమని జేడీయు అజయ్ అలోక్ ఖండించారు. ఈ క్రమంలో బీజేపి కేరళ జేడీయూ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ కూడా… నితీశ్ కుమార్ మిత్రులను మార్చడం.. బీజేపితో మైత్రిని కొనసాగించడాన్ని తీవ్రంగా వ్యవతిరేకించారు. జేడీయూతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. అవసరమైతే తాను తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫాసిస్టు శక్తులతో పోరాటానికి ఎంత మూల్యాన్ని చెల్లించడానికైనా వెనుకాడేది లేదన్నారు.
ఇదిలావుండగా, కేంద్రంలోని బీజేపి, మరీ ముఖ్యంగా నరేంద్రమోడీ సర్కార్ కావాలని తనను వేధింపులకు గురిచేస్తుందని.. ఈ కక్షపూరిత చర్యలను తాను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతానని చెప్పిన అర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే దాణా కుంభకోణం, బినామీ ఆస్తుల కేసులు ఎదుర్కొంటున్న అయనపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్నపుడు రైల్వే హోటల్స్ కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more